నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ. 13వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి యూకే హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన తాజా బెయిల్ పిటిషన్ను లండన్లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు కొట్టివేసిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తెలిపింది. లండన్కు వెళ్లిన సీబీఐ బృందం సహాయంతో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ బెయిల్ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. బెయిల్ రాకుండా అడ్డుకుంది. కాగా,పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ నిందితులలో ఒకరైన నీరవ్ మోడీని అప్పగింత వారెంట్పై అరెస్టు చేసిన యూకే అధికారులు 2019 మార్చి నుంచి జైలులోనే ఉంచారు.
నీరవ్ మోడీ పిటీషన్ కొట్టివేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES