Friday, June 20, 2025
E-PAPER
HomeNewsనిశాంక భారీ సెంచరీ

నిశాంక భారీ సెంచరీ

- Advertisement -

– శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 368/4
గాలె (శ్రీలంక):
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో యువ ఓపెనర్‌ పథుం నిశాంక (187, 256 బంతుల్లో 23 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ సెంచరీతో చెలరేగాడు. దినేశ్‌ చండిమాల్‌ (54, 119 బంతుల్లో 4 ఫోర్లు) సైతం అర్థ సెంచరీతో రాణించగా తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక పట్టు బిగిస్తోంది. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 495 పరుగులు చేయగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 368/4 పరుగులతో దూసుకెళ్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక మరో 127 పరుగుల వెనుకంజలో నిలిచినా.. చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంపై ఆతిథ్య జట్టు కన్నేసింది. ఎంజెలో మాథ్యూస్‌ (39, 69 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. కామిందు మెండిస్‌ (37 నాటౌట్‌, 56 బంతుల్లో 4 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (17 నాటౌట్‌, 26 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -