Sunday, March 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా, ఇజ్రాయెల్‌ నౌకలకి మాత్రమే నో ఎంట్రీ: ఇరాన్‌ మంత్రి

అమెరికా, ఇజ్రాయెల్‌ నౌకలకి మాత్రమే నో ఎంట్రీ: ఇరాన్‌ మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హర్మూజ్‌ జలసంధి విషయంలో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలకే హర్మూజ్ జలసంధిని మూసివేశామని తెలిపారు. ఇతర దేశాల నౌకలు మాత్రం స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని చెప్పారు. భద్రతా ఆందోళనల కారణంగా కొన్ని దేశాలు ఈ మార్గాన్ని వినియోగించడంలో వెనుకంజ వేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం చమురు ట్యాంకర్లు ఈ మార్గంలో రాకపోకలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఇదే సమయంలో ట్రంప్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ, మొజ్తాబా ఖమేనీ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -