Thursday, May 29, 2025
Homeసినిమాపవర్‌స్టార్‌ సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు

పవర్‌స్టార్‌ సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు

- Advertisement -

‘కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిస్థితికి తెరదించిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కి ధన్యవాదాలు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు’ అని నిర్మాత దిల్‌రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఏప్రిల్‌ 19న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక మీటింగ్‌ జరిపారు. పర్సంటేజ్‌ విధానం ఉంటే బాగుంటుందని ఎగ్జిబిటర్స్‌ కోరారు. అయితే దీనికి డిస్ట్రిబ్యూటర్స్‌ అంగీకారం చెప్పలేదు. ఈ పర్సంటేజ్‌ సమస్య ఈస్ట్‌ గోదావరి నుంచి మొదలై నైజాంకు కూడా వచ్చింది. దీంతో మే 18న ఛాంబర్‌లో మీటింగ్‌ జరిగింది. థియేటర్లు బంద్‌ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని నేను వారించాను. దీనికి అక్కడ అందరూ ఏకీభవించారు. ఛాంబర్‌కు వాళ్లు పర్సంటేజీ విషయంలో లేఖ రాశారు. వాళ్లు అనుకున్నది జరగపోతే బంద్‌ చేస్తామనేది అక్కడ సారాంశం. కానీ బయటికి జూన్‌ 1 నుంచి థియేటర్స్‌ బంద్‌ అనే వార్త వచ్చింది. ఎగ్జిబిటర్ల నిర్ణయంపై వచ్చిన వార్తలను ఖండించక పోవడం తప్పు. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్‌ మీటింగ్‌ జరిగింది. జూన్‌ ఫస్ట్‌ నుంచి ధియేటర్స్‌ కంటిన్యూ అవ్వాలని వారు కోరుకున్నారు. ఎవరు థియేటర్స్‌ ఇస్తే వాళ్ళకి పర్సంటేజ్‌ ఇస్తామని చెప్పారు. తర్వాత నిర్మాతల మీటింగ్‌ జరిగింది. నిర్మాతలంతా కూడా ఎగ్జిబిటర్స్‌కి ప్రాబ్లమ్స్‌ ఉన్నాయని యునానిమస్‌గా చెప్పారు. దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్నాం. ఈలోగా ఇష్యూ పవన్‌కళ్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ సినిమా వైపు డైవర్ట్‌ అయింది. పవన్‌కళ్యాణ్‌ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. థియేటర్స్‌ మూయడం అనేది నా అనుభవంలో ఎప్పుడూ చూడలేదు. అయితే ప్రభుత్వానికి మొత్తం ఇష్యూ రాంగ్‌గా కమ్యూనికేట్‌ అయింది. ఈ విషయమై మంత్రి దుర్గేష్‌ నాతో మాట్లాడారు. ఆయనకి క్లారిటీగా చెప్పాను. థియేటర్స్‌ బంద్‌ చేయడం జరగదు అని జాయింట్‌ మీటింగ్‌లో నిర్ణయించారని చెప్పాను. మే 30 భైరవం సినిమా వస్తుంది. జూన్‌ 5 కమలహాసన్‌ సినిమా, జూన్‌ 12 పవన్‌ కళ్యాణ్‌ సినిమా, జూన్‌ 20 కుబేర.. ఇలా కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి. అలాగే జూలైలో కూడా మంచి సినిమాలు ఉన్నాయి. ఈ సమయంలో సినీ పరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే మా అందరి ఉద్దేశం. ఈస్ట్‌ గోదావరిలో ఓ వ్యక్తితో మొదలైన సమస్య తెలంగాణకు ఆపాదించారు. సినిమా వాళ్లకు రెండూ ప్రభుత్వాలు చాలా ముఖ్యం. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానంగా ఉండాలనే సీఎం రేవంత్‌రెడ్డి నన్ను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా పెట్టారు. పవన్‌కళ్యాణ్‌ సినిమా ఇండిస్టీకి ఇచ్చిన సపోర్ట్‌ మామూలుది కాదు. గతంలో ప్రతిదానికి భయం భయంగా ఉండేది. కళ్యాణ్‌ వచ్చాకా పక్కంటికి వెళ్లినంత సులభంగా వెళ్లి, పేపర్‌ పట్టుకొని టికెట్‌ ధరలు పెంచుకొని వస్తున్నారు. అందరం కలిసి ఐక్యంగా ఉండాలనే ఆలోచన మా దగ్గర తక్కువ’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -