– కిందిస్థాయి సిబ్బంది ఫోన్లూ ట్యాపింగ్
– జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్కు సమాచారం
– వాంగ్మూలం ఇచ్చేందుకు రావాల్సిందిగా బాధితులకు పిలుపు
– ఖమ్మంలో చర్చనీయాంశంగా మారిన ట్యాపింగ్ వ్యవహారం
‘చిన్నా పెద్ద తేడా లేదు.. తమకు వ్యతిరేకంగా పనిచేస్తారనే అనుమానం వస్తే ఎవ్వరి ఫోన్ అయినా ట్యాప్ చేయాల్సిందే.. వారు ఎవరితో ఏమి మాట్లాడారో వినాల్సిందే..!’ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నుంచి చేసిన ఈ ట్యాపింగ్ దందా తాలూకు ఆనవాళ్లు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుండటం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుండటం.. ఖమ్మంలో మరింత చర్చనీయాంశమవుతోంది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎక్కడెక్కడ ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో.. ఆరా తీసే పనిలో సిట్ అధికారులు నిమగమయ్యారు. 2023 ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు అత్యధికంగా ఫోన్లు ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది. ఇప్పటి వరకు 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారుల దర్యాప్తులో తేలింది. బాధితుల్లో రాజకీయ ప్రముఖులతో పాటు వారి ముఖ్య అనుచరులు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, వ్యాపారులు ఉన్నారు. వీరితో పాటు కిందిస్థాయి సిబ్బందినీ వదల్లేదని దర్యాప్తులో స్పష్టమవుతోంది. ఎవరి ఫోన్లైతే ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారో వారికి సమాచారం ఇస్తున్నారు. ఇలా సమాచారం అందుకున్న వారు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లి వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఖమ్మంలో మంత్రి పొంగులేటి కార్యాలయ సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్
బీఆర్ఎస్పై నిరసన గళం వినిపిస్తున్న సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన అప్పట్లో ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు ఆయన అనుచరులు, ఖమ్మంలోని ఆయన క్యాంప్ కార్యాలయ సిబ్బంది ఫోన్లను నియంత్రణలోకి తీసుకున్నారని ప్రచారం జరిగింది. పీఆర్వో సురేష్తో పాటు సూపర్వైజర్ శ్రీకాంత్, అప్పట్లో డ్రైవర్గా పనిచేసిన జానీ ఫోన్ సైతం ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. పొంగులేటి ముఖ్య అనుచరులు మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య తదితరుల ఫోన్లు కూడా ట్యాపయ్యాయని ఈ ఏడాది జనవరిలోనే వారికి సమాచారం ఇచ్చారు. ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్రెడ్డితో పాటు పొంగులేటి వ్యక్తిగత సహాయకుల (పీఏ) ఫోన్ నంబర్లు కూడా ట్యాపింగ్ అయినట్టు పోలీసులు గుర్తించినట్టు వారు చెబుతున్నారు. గతంలోనే వాంగ్మూలం కోసం ఫోన్లు వచ్చినట్టు తేలింది.
తాజాగా పీఆర్వోతో పాటు డ్రైవర్కు జూబ్లీహిల్స్ స్టేషన్కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సమాచారం ఇచ్చారు. అలాగే పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ సిబ్బందిలో కొందరి ఫోన్లనూ ట్యాప్ చేసినట్టు తెలుస్తోందిదీని ఆధారంగానే మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి చెందిన కంపెనీల డబ్బును టాస్క్ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్టు గుర్తించారు. మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావుతో సన్నిహితంగా ఉన్న జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో వీరికి కూడా వాంగ్మూలం కోసం పిలుపు వచ్చే అవకాశం ఉంది.
ఎవ్వరి ఫోన్లనూ వదల్లేదు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES