- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేసే ప్రణాళికలు ఏమీ లేవని గల్ఫ్ దేశం ఒమన్ స్పష్టం చేసింది. టోల్ ఫీజు వసూలు చేయాలన్న ఇరాన్ ప్రతిపాదనను ఒమన్ వ్యతిరేకించింది. ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ 10 డిమాండ్లలో టోల్ ఫీజు వసూలు చేయడం ఒకటి. చమురు రవాణాకు కీలకమైన ఈ జలసంధిలో స్వేచ్ఛాయుత, సురక్షితమైన నౌకాయానాన్ని కొనసాగించడానికి ఒమన్ కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి సయీద్ బిన్ హమూద్ బిన్ సయీద్ ఆల్ హామీ ఇచ్చారు.
- Advertisement -



