Tuesday, June 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధం వద్దు..శాంతి కావాలి

యుద్ధం వద్దు..శాంతి కావాలి

- Advertisement -

– ఇరాన్‌పై అమెరికా దాడులను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు
వాషింగ్టన్‌:
ఇరాన్‌ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జరిపిన వైమానిక బాంబు దాడులు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలకు దారితీసాయి. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని ప్రజలు ఆందోళనల బాటపట్టారు. ట్రంప్‌ వైఖరిని వారు ఖండించారు. ఇది నేరమంటూ,శాంతి కావాలని వారు నినాదాలు చేశారు. ట్రంప్‌కి నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్‌ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.అయితే కరాచిలో వేలాది మంది ట్రంప్‌ ఫొటోను కాళ్లతో తొక్కుతూ ఆందోళనలు చేయడం గమనార్హం.
అమెరికాలో నిరసనలు
ట్రంప్‌ వివాదాస్పద ఇమ్మిగ్రేషన్‌ విధానంను వ్యతిరేకిస్తూ అమెరికా అంతటా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే.తాజాగా ఇరాన్‌ పై బాంబు దాడులకు వ్యతిరేకంగా శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌, బోస్టన్‌ లో ప్రజలు రోడ్లపైకి వచ్చారు.యుద్ధం కోసం కాదు, ప్రజల అవసరాల కోసం ఖర్చుచేయండి అంటూ అదోళన చేపట్టారు.అమెరికా బంకర్‌ బ్లస్టర్‌ బాంబులను వినియోగించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. న్యూయార్క్‌, బోస్టన్‌లో పార్టీఫర్‌ సోషలిజం అండ్‌ లిబరేషన్‌ సంస్థల ఆధ్వర్యంలో నిరస నలు జరిగాయి. ఆన్సర్‌ కొయలేషన్‌ సంస్థ ” ఇరాన్‌ పై యుద్దం ఆపండి” పేరుతో తమ ఆందోళనలు కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికాతో పాటు యూరప్‌, ఆసియా, ఆఫ్రికా వ్యాప్తంగా దాడులను వ్యతిరేకిస్తూ ఆం దోళనలు జరిగాయి. లండన్‌, బ్రసెల్స్‌, దిహేగ్‌ నగరాల్లో వేలాది మంది గాజాలో హింసను ఆపాలని, అమెరికా, ఇజ్రాయిల్‌ విధానాలను వ్యతి రేకిస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఆసియాలోని జపాన్‌, ఇరాన్‌ లతో పాటు మొరాకో, దక్షిణాఫ్రికా, సొమాలియా, పోర్చుగల్‌లో యుద్ధ వ్యతిరేక ర్యాలీ లు జరిగాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అమెరికా దాడులను ఖండించారు.ఇరాన్‌ ప్రజలకు సహాయమందిస్తామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -