Friday, January 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయండొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బ‌హుక‌ర‌ణ‌: మచాడో

డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బ‌హుక‌ర‌ణ‌: మచాడో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వెనెజువెలా విపక్ష నేత, 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గురువారం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో మారియా మచాడో సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. నోబెల్ పతకాన్ని ఆయనకు అందించాను” అని ప్రకటించారు. అయితే, ట్రంప్ ఈ పతకాన్ని భౌతికంగా స్వీకరించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

ఈ పరిణామంపై నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్ స్పందించింది. బహుమతి పతకాన్ని ఒకరి నుంచి మరొకరు తీసుకోవచ్చని, కానీ నోబెల్ గ్రహీత హోదాను మాత్రం బదిలీ చేయడం, పంచుకోవడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కాగా, “ఈ బహుమతి వెనెజువెలా ప్రజలది. దీనిని ట్రంప్‌తో పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం” అని మచాడో గతంలోనే వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -