నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించింది. ధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్కు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటే.. మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని.. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్పా ? తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్గా నిలబెట్టడం తప్పా? అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ కాళేశ్వరం అంటూ విమర్శించారు. ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదని.. ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌస్లు, 15 రిజర్వాయర్లు, 200 కిలోమీటర్ల మేర టన్నెల్ ఉందన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరమని.. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ని బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేసిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చారని.. మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోందని.. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌస్ పనులు చేసిన మెఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీలో ఉన్న తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లాడకపోవడం శోచనీయం. గోదావరి-బనకచర్లను ఆపే బాధ్యతను ఆయన తీసుకోవాలి. కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల తీసుకోవాలి’’ అని కవిత అన్నారు.
కేసీఆర్ను బద్నాం చేసేందుకే నోటీసులు : ఎమ్మెల్సీ కవిత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES