Wednesday, June 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసింగయ్య మృతి కేసులో జగన్ కు నోటీసులు

సింగయ్య మృతి కేసులో జగన్ కు నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి వైసీపీ అధినేత జగన్ ను కూడా నిందితుడిగా చేర్చారు.

ఈ కేసులో జగన్ ను ఏ2గా పేర్కొన్న పోలీసులు… తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు నోటీసులతో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ కార్యాలయ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అంతేకాదు, సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చ్యూనర్ (AP 40 DH 2349) వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -