- Advertisement -
నవతెలంగాణ – బిచ్కుంద
తెలంగాణ రాష్ట్ర పురపాలక పాలనశాఖ హైదరాబాద్ వారి ఉత్తర్వుల మేరకు అక్టోబర్ రెండున గాంధీ జయంతి పురస్కరించుకొని పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు ఏ ఇతర జంతువులను వదించరాదని వాటి మాంసం విక్రయించరాదని దుకాణదారులకు వీరితో పాటు మాంసాహార హోటల్ యజమానులకు బిచ్కుంద మున్సిపల్ కార్యాలయ సిబ్బంది నోటీసులు అందజేశారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వారిపై 1960 జంతు సంరక్షణ చట్టం ప్రభుత్వ ఆదేశానుసారం చట్టరీత్యా చర్యలు తీసుకోబడుననీ నోటీసులో పొందుపరిచారు. మున్సిపల్ సిబ్బంది వీరేశం, సంజు ఉన్నారు.
- Advertisement -