- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ అయ్యారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై తాజా పరిణామాలను ఆయన ప్రధానికి వివరించారు. త్రివిధ దళాధిపతులతో కూడా డోభాల్ భేటీ అయినట్లు సమాచారం. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్-పాక్ మధ్య నెలకొంటున్న దాడుల నేపథ్యంలో డోభాల్ వరుసగా ప్రధానితో చర్చలు జరుపుతున్నారు.
- Advertisement -