నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఎన్టిటి డేటా ఇండియా డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ (NTT DATA India Digital Pvt. Ltd.), ఈ ఏడాది కూడా తమ సేవా గుణాన్ని చాటుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా సైనిక్పురి-యాప్రాల్లోని సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ నిరాశ్రయులకు అండగా నిలిచింది. వరుసగా మూడవ సంవత్సరం ఈ ఆశ్రమానికి అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసి, అక్కడి నివాసితుల ముఖాల్లో చిరునవ్వులు నింపింది.
ఉద్యోగుల సమిష్టి కృషితో సాయం
సంస్థలోని ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు సాయం చేయాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను సంస్థ అభినందించింది బ్రహ్మ బీరం (కంట్రీ హెడ్), కరోలిన్ హెస్సింగ్ (డైరెక్టర్ – హ్యూమన్ రిసోర్సెస్), నరేష్ పలేటి (డైరెక్టర్ – ఫైనాన్స్) వీరి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమం వల్ల ఆశ్రమంలోని వృద్ధులు, అనాథలు పండుగను సంతోషంగా జరుపుకోగలుగుతారని ఫౌండేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. నిరాశ్రయుల పునరావాసం కోసం సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఎన్టిటి డేటా యాజమాన్యం కొనియాడింది.
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ నిరాశ్రయులకు ఎన్టిటి డేటా క్రిస్మస్ కానుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



