- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలోని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విధుల సమయంలో ఇద్దరు నర్సులు డ్యాన్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. స్పందించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరీలను సస్పెండ్ చేశారు. డ్యాన్స్ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన మరో 12 మంది నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్రమశిక్షణ పాటించాలని సూచించారు.
- Advertisement -



