- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్కు టీమ్ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేసింది. జట్టులో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి స్థానం దక్కింది. ఈ నెల 19 నుంచి భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. మరోవైపు.. 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ సారథిగా వ్యవహరించనున్నాడు.
టీమ్: గిల్(కెప్టెన్), రోహిత్, విరాట్ కోహ్లి, శ్రేయస్(VC), అక్షర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్, వాషింగ్టన్, కుల్దీప్, హర్షిత్ రానా, సిరాజ్, అర్ష్దీప్, ప్రసిద్ధ, ధ్రువ్ జురెల్, జైస్వాల్
- Advertisement -