- మాజీ ప్రజా ప్రతినిధులు ఆవేదన
పాత బిల్లుల కోసం పడి గాపులు
సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న పోస్ట్
నవతెలంగాణ చందుర్తి: గత ప్రభుత్వం ఆయామంలో సర్పంచ్ లు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. బిల్లుల శాంక్షన్ కోసం దీక్షలు,ధర్నాలు చేస్తు పెండింగ్ బిల్లుల కోసం పోరాటం చేస్తున్న వైనం మనం చూస్తున్నా సంగతి విధితమే. సర్పంచ్ ల పదవి కాలం అయిపోయి పదిహేను నెలలు గడుస్తున్నా చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాక విసికి పోతున్నారు.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ లను బజార్ పలు జేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్ లుగా గెలిచి పని చేసిన వారు తమతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపించి బిల్లులు ఇవ్వకపోవడంతో తమ బతుకును బజారు పలుజేసిందని బిఆరెస్ కు చెందిన నాయకులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు.ఇవ్వాలని వేడుకుంటున్నారు.
కమిషన్లు ఇవ్వనిదే అధికారులు ఎం బి రికార్డ్ చేయరు
చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రావాలంటే ఎం బి రికార్డ్ చేయాలి అంటే పై నుండి కింది స్థాయి అధికారులకు పర్సన్టేజ్ ఇవ్వనిదే రికార్డు చేయారు అని ఏ.ఇ, డి.ఇ, ఇ.ఇ, లకు వేల రూపాయలు కమిషన్లు ఇవ్వడం జయుగుతుంది.మరో వైవుగా ఎంపీడీఓ,కార్యదర్శుల కు ముడుపులు ఇవ్వనిదే పల్లె ప్రకృతి కి నిర్వహణ కు మార్కులు వేయరని ఆవేదన తో ఓ మాజీ సర్పంచ్ ఏకంగా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.ఏది ఏమైనా పదవి లో ఉండగా ప్రజా ప్రతినిధులు అధికారుల కు ఇచ్చే కమిషన్లను బహిర్గతం చేయలేదు కానీ ఇప్పుడు వారి పదవి అయిపోయాక బహిర్గతం చేయడంతో ఆ విషయం హాట్ టాపిగా మారింది.మరోవైపు గా గత సంవత్సరం పంచాయతీ అధికారి తన కారు తో సనుగుల గ్రామంలో ఓ వ్యక్తి కి యాక్సిడెంట్ చేయగా కేసు కావద్దని చందుర్తి మండలంలోని సర్పంచ్ లు మొత్తం పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టి అధికారి పై కేసు పెట్టవద్దని పోలీసుల పై ఒత్తిడి తెచ్చారు.ఇదంతా సీక్రెట్ గా జరిగింది.