Friday, June 20, 2025
E-PAPER
Homeజాతీయంరూపాయికి చమురు మంట

రూపాయికి చమురు మంట

- Advertisement -

– 30పైసలు పతనమై 86.73కు..
– మూడో రోజూ దిగజారిన భారత కరెన్సీ
న్యూఢిల్లీ:
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు చమురు ధరలకు ఆజ్యం పోయడంతో గురువారం రూపాయి విలువ ఒత్తిడికి గురైంది. ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధ అనిశ్చిత్తులకు తోడు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో రూపాయి విలువ మరింత పడిపోయింది. దీనికి తోడు స్టాక్‌ మార్కెట్ల వరుస పతనం.. ఎఫ్‌ఐఐలు తరలిపోవడంతో గురువారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 30పైసలు పతనమై 86.73కు దిగజారింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సేంజీలో డాలర్‌తో రూపాయి విలువ 86.54వద్ద ప్రారంభమై.. ఇంట్రాడేలో 86.49కి కనిష్టానికి పడిపోయింది. తుదకు బుధవారం నాటి విలువతో పోల్చితే 30 పైసలు కోల్పోయి 86.73 వద్ద ముగిసింది. బుధవారం 9 పైసలు తగ్గింది. ముడి చమురు బ్యారెల్‌ ధర 0.25 శాతం పెరిగి 76.89 వద్ద ముగిసింది. భౌగోళిక పరిస్థితులు ఇలాగే కొనసాగితే డాలరుతో రూపాయి విలువ 90కి చేరినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి పతనంతో దిగుమతి, దిగుమతి ఆధారిత ఉత్పత్తులు భారం కానున్నాయి. బంగారం ధర మరింత పెరగనుంది. అదే విధంగా ప్రభుత్వ విదేశీ అప్పు చెల్లింపులు భారంగా మారనున్నాయి. ఈ పరిణామాలు అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ”మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి తెస్తాయి. బలమైన అమెరికా డాలర్‌, పెరుగుతున్న ప్రపంచ ముడి చమురు ధరలు కూడా రూపాయిపై ప్రతికూల ఒత్తిడిని కలిగిస్తాయి.” అని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ పరిశోధన విశ్లేషకుడు అనుజ్‌ చౌదరి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -