- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరసగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ విమానాల్లో ఎదో ఒక సమస్య వస్తుంది. తాజాగా శనివారం ఉదయం ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన AI129 విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 6:30 గంటలకు బయల్దేరాల్సిన విమానం మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరనుంది. దాదాపు ఆరు గంటలు ఆలస్యమవడంతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా చింతిస్తున్నట్లు తెలిపింది.
- Advertisement -



