Sunday, June 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅదుపు తప్పిన వాహనం.. ఫిల్లర్ గుంతలో పడి ఒకరి మృతి

అదుపు తప్పిన వాహనం.. ఫిల్లర్ గుంతలో పడి ఒకరి మృతి

- Advertisement -

నవతెలంగాణ-గంగాధర
గాధర మండలం గర్శకుర్తి గ్రామ బీసీ కాలనీ వద్ద ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పి భవన నిర్మాణం కోసం తవ్విన ఫిల్లర్ గుంతలో పడి ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయ పడ్డారు. గ్రామస్తులు, ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిగురుమామిడి మండలానికి చెందిన వెంకటి అనే వృద్ధుడు గర్శకుర్తి గ్రామంలో దుర్గమ్మ పూజ, కొలుపు కోసం వచ్చాడు. పూజ పూర్తి కాగానే ఆదివారం ఉదయం 6 గంటలకు ఆర్టీసీ బస్సు ఎక్కించేందుకు పూజ పెట్టుకున్న ఇంటి యజమాని అంబటి ఆంజనేయులు తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని దింపడానికి వెళ్తుండగా, వాహనం తప్పి భవన నిర్మాణం తవ్విన ఫిల్లర్ గుంతలో బోల్తా పడింది. దీంతో ఇద్దరు గుంతలో పడగా, వాహనం వెనుకాల కూర్చుకున్న వెంకటి తల పగిలి అక్కడికక్కడే మరణించగా, అంబటి ఆంజనేయులు తీవ్రంగా గాయ పడ్డాడు. దుర్గమ్మ కొలుపు కోసం వచ్చి ప్రమాదవశాత్తు వాహనం అదుపు తప్పి గుంతలో పడి ప్రాణాలు కోల్పోడం గ్రామస్తులను కలచి వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరగా, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వంశీకృష్ణ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -