- Advertisement -
- – వివిధ సమస్యలపై 148 దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ – మల్హర్ రావు - భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం మండలంలో చిన్నతూoడ్ల, శాత్రజ్ పల్లి గ్రామాల్లో మండల తహసిల్దార్ రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వివిధ సమస్యలపై మొత్తం 148 దరఖాస్తులు వచ్చినట్లుగా తహశీల్దార్ తెలిపారు. టీమ్-1తహశీల్దార్ ఆధ్వర్యంలో చిన్నతూoడ్లలో 51 దరఖాస్తులు, టీమ్-2 డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాత్రజ్ పల్లిలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రంలో 97 దరఖాస్తులు రాగ మొత్తం 148 వివిధ భూ సమస్యలసై వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదికారులు పాల్గొన్నారు.
- కాటారంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ భారతి రైతు సదస్సులో భాగంగా కాటారం మండలంలోని చిదినేపల్లి, ధన్వాడ గ్రామాల్లో గురువారం రైతు సదస్సులు నిర్వహించినట్లుగా తహశీల్దార్ నాగరాజు తెలిపారు.వివిధ భూ సమస్యలపై మొత్తం 507 దరఖాస్తులు రాగా చిదినేపల్లిలో 178, ధన్వాడలో 329 దరఖాస్తులు వచ్చినట్లుగా, వాటిని వెంటనే ఆన్లైన్లో నమోదు చేసినట్లుగా తెలిపారు.
- Advertisement -