- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల ముప్పును దృష్టిలో మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి ఇవ్వాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈనెల 30తో మూడో నెలల రేషన్ కోటా పంపిణీ ముగియనుంది. దీంతో లబ్దిదారులు గడువు ముగిసేలోపు 3నెలల రేషన్ కోటా బియ్యాన్ని తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జూన్ 1 నుంచి 30వ తేదీ లోగా ఈ మూడు నెలల రేషన్ పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీఎస్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేసి పంపిణీ చేపట్టారు.
- Advertisement -