- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్లో తమకు అప్పగించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తిచేశామని భారతవైమానిక దళం (ఐఎఎఫ్) ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని ఐఎఎఫ్ ఆదివారం ఎక్స్లో పేర్కొంది. వైమానిక దళం ఈ ఆపరేషన్లను పూర్తి కచ్చితత్వంతో, ఉద్దేశపూర్వకంగా, జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించిందని ఎక్స్లో పేర్కొంది. భారత్, పాక్ల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన మరుసటి రోజు ఈ ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్లు ఇప్పటికీ కొనసాగుతున్నందున, సకాలంలో వివరాలను అందిస్తామని పేర్కొంది. ఊహాగానాలు, తప్పుడు వార్తల వ్యాప్తికి దూరంగా
- Advertisement -