Monday, February 9, 2026
E-PAPER
Homeజాతీయంస్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసానికి విపక్షాల ప్లాన్..!

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసానికి విపక్షాల ప్లాన్..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్రమవుతున్న విభేదాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం ఉదయం ఒ ప్రముఖ వార్త ఛానల్ లో వచ్చిన కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు, ఇరుపక్షాల మధ్య అపనమ్మకం ముదరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, విపక్షాల తీవ్ర నిరసనల మధ్య సభను స్పీకర్ అర్ధాంతరంగా వాయిదా వేశారు. ‘ప్రధానిని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష ఎంపీలు ఏదో అనుకోనిది చేయొచ్చని సమాచారం అందింది’ అని ఓం బిర్లా చెప్పడం వివాదానికి దారితీసింది. అంతకుముందు కొందరు మహిళా ఎంపీలు ప్లకార్డులతో ప్రధాని సీటు వద్దకు వెళ్లారు. స్పీకర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ “పూర్తి అబద్ధాలు” అని కొట్టిపారేశారు. “ప్రధాని ఇప్పుడు స్పీకర్ చాటున దాక్కుంటున్నారు… ఆయనకు ధైర్యం లేదు” అని ఆమె తీవ్రంగా విమర్శించారు.

ఈ అవిశ్వాస తీర్మానంలో స్పీకర్‌కు వ్యతిరేకంగా మూడు ప్రధాన అంశాలను ప్రతిపక్షాలు హైలైట్ చేయనున్నాయి. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన పుస్తకంలోని కొన్ని భాగాలను చదివేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడం మొదటిది. అదే సమయంలో కాంగ్రెస్‌ను, గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న పుస్తకాల నుంచి చదివేందుకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకు అనుమతి ఇవ్వడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన దూబేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -