Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడిబాట కార్యక్రమం నిర్వహించాలి: కలెక్టర్

బడిబాట కార్యక్రమం నిర్వహించాలి: కలెక్టర్

- Advertisement -

 నవతెలంగాణ-భూపాలపల్లి
విద్యార్థుల సంఖ్య పెంపు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్  బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.గురువారం ఐడిఓసి కార్యాలయంలో  జూన్ 6 నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంపై  విద్యా, సంక్షేమ శాఖలు, డిఆర్డీఓ, పంచాయతి, కార్మిక, మున్సిపల్, మెప్మా తదితర శాఖల అధికారులతో నిర్వహించిన   సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..  జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో “బడిబాట” కార్యక్రమాన్ని జూన్ 6 నుండి 19 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు 6 నుండి 19వ తేదీ వరకు తయారు  చేసిన  షెడ్యూల్ ప్రకారం విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించి  బడి ఈడు పిల్లలందరిని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని తెలిపారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఇవన్నీ ప్రజలకు తెలియచెప్పి అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు.  అన్ని శాఖల అధికారులు సమన్వయంతో  పని చేసి ప్రభుత్వ పాఠశాలాలల్లో విద్యార్థుల నమోదులు పెంచాలన్నారు.   గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విద్యకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

ఈ సంవత్సరం జిల్లాలో మొత్తం 450 పాఠశాలలు ఉండగా, అందులో 34 పాఠశాలల్లో విద్యార్థులు నమోదు కాలేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో   శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ద్వారా విద్యా బోధన జరుగుతుందని ప్రజల్లో అవగాహన కల్పించాలని వివరించారు. 

ప్రధాన కార్యక్రమాలు:

జూన్ 6వ తేదీన గ్రామసభలు నిర్బహించి, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంపై పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. 7వ తేదీన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపాలని, బడి ఈడు పిల్లల వివరాలు సేకరించి గ్రామ విద్యా రిజిస్టర్ లో నమోదులు చేయాలన్నారు. 8 నుండి  10వ తేదీ వరకు డ్రాప్ అవుట్ విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని తెలిపారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి భవిత కేంద్రాలలో చేర్పించాలని సూచించారు. 

జూన్ 11: పాఠశాల నిర్వహణ కమిటీలు, గ్రామ సమాఖ్యలు, గ్రామ పెద్దలు తదితరులతో సమావేశం నిర్వహించి 6 నుండి 10 వ తేదీ వరకు జరిగిన కార్యక్రమాలు పరిశీలన చేయాలన్నారు. బడి బయటి పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని తెలిపారు. 

జూన్ 12: విద్యా లయాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా పండుగ వాతావరణంలో విద్యార్థుల ను ఆహ్వానం పలకాలని తెలిపారు.  పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.  పాఠ్య, నోట్ పుస్తకాలు పంపిణీ చేపట్టి విద్యార్థులను అభినందించాలని సూచించారు.   

జూన్ 13:  సామూహిక అక్షర అబ్యాసం కార్యక్రమా లు నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు.   బాలసభలు నిర్వహించాలని తెలిపారు. పాఠశాలల  విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్య యొక్క ప్రాధాన్యత ను వివరించాలన్నారు. 

జూన్ 16: శాస్త్ర ప్రదర్శనలు, డ్రాయింగ్, కథల పోటీలుతో పాటు విద్యార్థులు కమ్యూనిటి సభ్యులు ప్లే కార్డ్స్, స్లొగన్స్ తో ప్రదర్శన చేయాలని తెలిపారు. విద్యార్థులకు ఐ కెన్ రీడ్ లేదా ఐ కెన్ కౌంట్ వంటి గుర్తింపు బ్యాడ్జ్ ఇవ్వాలన్నారు.

జూన్ 17: విద్య, బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి, పాఠశాలల్లో నమోదు చేయాలని తెలిపారు. విద్యార్థుల హాజరు రిజిష్టర్ పక్కాగా నిర్వహించాలని తెలిపారు. నూరి5 శాతం నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలకార్మికులు లేకుండా చూడాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కమ్యూనిటి సభ్యులు ప్రత్యేక అవసరాలున్న  పిల్లలకు కల్పించే సౌకర్యాలు వివరించాలన్నారు. 10, ఇంటర్ పాసైన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆహ్వానించి విద్య యొక్క ప్రాధాన్యత వివరించాలన్నారు.  సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల కు, కెజిబివి విద్యార్థులకు అందించే సౌకర్యాలు తల్లిదండ్రులకు వివరించాలని తెలిపారు.  బాలికలకు.కల్పిస్తున్న స్పెషల్ డిఫెన్సె కార్యక్రమాలు, బాలికల రక్షణకు కల్పిస్తున్న హక్కులు, చట్టాలు తెలియ చేయాలని తెలిపారు. 

జూన్ 18: పాఠశాలల్లో డిజిటల్ సౌకర్యాలు, చెట్లు పెంపకం, కిచెన్ గార్డెన్స్ నిర్వహణ చేయాలన్నారు.

జూన్ 19: ముగింపు రోజున స్పోర్ట్స్ డే చేయాలని, ఆటలు నిర్వహించి  విద్యార్థులకు బహుమతులు అందచేయాలని తెలిపారు. 

బడిబాటలో నమోదు అయిన విద్యార్థులు వివరాలు ప్రతి రోజు ఆన్లైన్ చేసేందుకు మండల, జిల్లా స్థాయిలో ఇంచార్జ్ లను నియమించాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలు, కెజిబివిల్లో బడి బాట డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల చిన్నారుల జాభితా సేకరించి బడి ఈడు వయసున్న ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా సమాఖ్యలు సమావేశంలో అవగహన కల్పించాలని, తద్వారా ప్రభుత్వ బడులల్లో చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజేందర్, డిఆర్డీఓ బాల కృష్ణ, ఎస్సి, ఎస్టీ సంక్షేమ అధికారులు సునీత, రాజరత్నం,  వైద్యశాఖ అధికారి డా మధుసూదన్, కార్మిక శాఖ అధికారి వినోదా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మెప్మా పిడి రాజేశ్వరి, మండల విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -