నవతెలంగాణ -పరకాల
ప్రజల భద్రతే మా లక్ష్యమని పరకాల ఎసిపి సతీష్ బాబు అన్నారు. శనివారం సిపి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల పట్టణంలోని పాత సి ఎం ఎస్ గోడౌన్స్ నుండి వయా అంబేద్కర్ స్టార్చ్ మీదుగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పరకాల ఎసిపి మాట్లాడుతూ పహాల్గాం ఘటన ద్వారా దేశ ప్రజల్లో అలజడి రేగినప్పటికి ఆపరేషన్ సిందూర్ ద్వారా విజయం సాధించి ఆత్మవిశ్వాసం చాటడం జరిగిందన్నారు.అదే క్రమంలో దేశం, రాష్ట్రంతో పాటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో సైతం ఎలాంటి క్రౌడ్ కంట్రోల్ పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఎసిపి తెలిపారు.తాము ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ఈ కవాతులో ఏఆర్ఎఫ్ అధికారి సరస్వతి తో పాటు పరకాల, శాయంపేట, ఆత్మకూరు సిఐలు క్రాంతి కుమార్, రంజిత్ రావు, సంతోష్,ఎస్సైలు శివకుమార్, రమేష్, పరమేశ్వర్, కొంక అశోక్, తిరుపతి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భద్రతే మా లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES