నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ దాడులను విరమించుకునేలా చేయాలని పాకిస్థాన్ ప్రపంచ దేశాలను వేడుకున్నదని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. శుక్రవారం భారతదేశంలో స్వదేశీంగా నిర్మించిన తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. నావికాదళ సిబ్బందితో ఆయన మాట్లాడారు. పాకిస్థానీ నేలపై ఉన్న ఉగ్ర స్థావరాలను ఐఏఎఫ్ ధ్వంసం చేస్తే, ఆరేబియా సముద్రంలో ఉన్న భారత యుద్ధ నౌకలు.. పాకిస్థానీ నేవీని తీరానికి పరిమితం చేశాయన్నారు. చాలా తక్కువ సమయంలోనే పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామన్నారు. . మన సైనిక దళాలు ఎంతో వేగంగా, స్పష్టమైన దాడులు చేశాయని, అసాధారణ రీతిలో ఆ దాడులు జరిగినట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకే కాదు, వాళ్లను పెంచి పోషించే వాళ్లకు కూడా స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని.. ఉగ్రవాదంపై అది మూకుమ్మడి దాడి అని రాజ్నాథ్ చెప్పారు.
దాడులను ఆపాలని ప్రపంచదేశాలను పాక్ వేడుకుంది: రాజ్నాథ్ సింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES