Thursday, December 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలునాగర్‌కర్నూల్ జిల్లా కుప్పగండ్లలో నిలిచిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌..

నాగర్‌కర్నూల్ జిల్లా కుప్పగండ్లలో నిలిచిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ పంచాయతీలోని పదో వార్డులో అభ్యర్థికి గుర్తు కేటాయించకపోవడంతో పోలింగ్‌ నిలిచిపోయింది. ఆ వార్డులో మొత్తం ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా.. ఇద్దరికి ఎన్నికల సంఘం పక్షాన వచ్చిన బ్యాలెట్ పత్రాల్లో గుర్తులను కేటాయించారు. కానీ మూడో అభ్యర్థి యాదయ్యకు గుర్తు కేటాయించకపోవడంతో గమనించిన ఓటర్లు ఎన్నికల అధికారులకు ఫర్యాదు చేయగా.. పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -