ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పాపా’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుం టోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు నిర్మాత నీరజ కోట. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘దాదా’ చిత్రాన్ని జె.కె.ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెలుగులో ‘పాపా’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది.
కవిన్, అపర్ణాదాస్ జంటగా భాగ్యరాజా, విటివి గణేష్ కీలక పాత్రల్లో రూపొంది, తమిళంలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రానికి గణేష్.కె.బాబు దర్శకత్వం వహించారు.
హైదరాబాద్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సంధ్య థియేటర్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత నీరజ కోట మాట్లాడుతూ, ‘ఇంత మంచి సినిమాతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం చాలా గర్వంగా ఉంది. సినిమా చూస్తున్న వారంతా స్ట్రెయిట్ సినిమా చూస్తున్నట్లుగా ఉందని చెబుతుంటే ఈ సినిమా కోసం మేం పడిన కష్టమంతా మర్చిపోయేట్టు చేసింది. జెన్.మార్టిన్ సంగీతం, ఎలిల్ అరసు ఛాయాగ్రహణం.. ముఖ్యంగా గణేష్ బాబు దర్శకత్వం ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. కవిన్ – అపర్ణాదాస్ల మధ్య కెమిస్ట్రీ, కాన్ఫ్లిక్ట్ అందరినీ కట్టిపడేస్తోంది. ఈ సినిమా విజయం ఇస్తున్న ఉత్సాహంతో త్వరలో ఒక స్ట్రెయిట్ సినిమాని ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు. ఈ సక్సెస్ మీట్లో ఎన్నారై శశికాంత్, ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 236 థియేటర్లలో విడుదల చేసిన ఎమ్.జి.ఎమ్ మూవీస్ ఎమ్.అచ్చిబాబు, ఆర్జే లక్ష్మీ పెండ్యాల, బిజినెస్ కోఆర్డినేటర్ నారాయణ, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ పాల్గొని… ఇలాంటి హార్ట్ టచ్చింగ్ ఫిల్మ్ను తెలుగు ప్రేక్షకులకు అందించిన నీరజ కోటను అభినందించారు.
‘పాపా’కి విశేష ప్రేక్షకాదరణ
- Advertisement -
- Advertisement -