- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విద్యార్థులను కొట్టాడని టీచర్లపై పేరెంట్స్ దాడి చేశారు. బీహార్ లోని గయా జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే వారిని వారించి చెంపదెబ్బ కొట్టారు టీచర్ రాకేశ్ రంజన్. దింతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు.
ఇంకేముంది స్కూల్ కు వచ్చి కర్రలతో రాకేశ్ ను చితకబాదారు పేరెంట్స్. అడ్డువచ్చిన మరో ఉపాధ్యాయుడిపైనా దాడి చేశారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు… విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -