- Advertisement -
– తెలంగాణ పత్తి రైతుల సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధరల తేడా చెల్లింపు పథకం (పీడీపీఎస్) విధానంతో పత్తి రైతులకు తీవ్ర నష్టమని తెలంగాణ పత్తి రైతుల సంఘం తెలిపింది. ఈమేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ట్ర కన్వీనర్ పుచ్చకాయలు కృష్ణారెడ్డి, కో కన్వీనర్ మూఢ్ శోభన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశం పెట్టడం వల్ల రైతాంగానికి నష్టమనీ, కేంద్ర ప్రభుత్వం ఆ పద్దతిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లో విఫలమైన ఆ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని ప్రయత్నించడం సరైందికాదని పేర్కొన్నారు. ఆ విధానంతో పత్తి రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
- Advertisement -