Friday, June 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభార‌త్‌తో శాంతిచ‌ర్చ‌ల‌కు యూఎస్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం కావాలి: పాక్‌ ప్రధాని

భార‌త్‌తో శాంతిచ‌ర్చ‌ల‌కు యూఎస్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం కావాలి: పాక్‌ ప్రధాని

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పెహల్గామ్‌ దాడి తర్వాత పాకిస్తాన్‌ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌ ద్వారా భారత ఆర్మీ పాకిస్తాన్‌ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలకు తన గళాన్ని వినిపిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఈ బృందాలు వెళ్లి ఉగ్రవాదంపై భారత వైఖరిని స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్‌కి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ తరుణంలో ఉగ్రవాదానికి కేంద్ర బిందువైన పాకిస్తాన్‌కి ఆందోళన మొదలైంది. ప్రపంచ దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలవడంతో.. పాకిస్తాన్‌ ప్రధాని భారత్‌తో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమయ్యారు. శాంతి చర్చల కోసం భారత్‌తో సంప్రదింపులు జరిపేందుకు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అమెరికా సహాయాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం పొరుగున్న భారత్‌తో తలెత్తిన ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ట్రంప్‌ సహాయాన్ని కోరినట్లు, ఇరు దేశాల మధ్య సంప్రదింపులను సులభతరం చేయాలని అమెరికాను కోరినట్లు ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో షెహబాజ్‌ అన్నారని మీడియా పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -