ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నాయకానాయికలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పి పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘పీ పీ డుమ్ డుమ్’ పాటని ముంబయిలో గ్రాండ్గా లాంచ్ చేశారు.
నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ : ధనుష్
”కుబేర’ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. చాలా డిఫరెంట్ ఫిల్మ్. నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమాలో బెగ్గర్ క్యారెక్టర్ని ప్లే చేశాను. ఇలాంటి క్యారెక్టర్ని నేను ఇప్పటివరకు చేయలేదు. ఈ సినిమా నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది. మా డైరెక్టర్ శేఖర్ బ్రిలియంట్ డైరెక్టర్. సినిమాని అద్భుతంగా తీశారు.
మంచి సినిమా చేశాం : నాగార్జున
ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనుకున్నప్పుడు శేఖర్ ఈ కథతో వచ్చారు. తన సెన్సిబిలిటీస్ అద్భుతంగా ఉంటాయి. అలాగే తన మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. జిమ్ సర్బ్తో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్. రష్మిక సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. తను అద్భుతంగా నటించింది. డబ్బింగ్ చూసిన తర్వాత తనకు ఫోన్ చేసి అభినందించాను. దేవిశ్రీ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ధనుష్ అద్భుతంగా చేశారు.
నా పాత్ర సర్ప్రైజ్ చేస్తుంది: రష్మిక మందన్న
ఒక నటిగా ఈ సినిమా నాకు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇది ఐ ఓపెనర్ లాంటి సినిమా. అన్నీ కూడా రియల్ లొకేషన్స్లో షూట్ చేశాం. నాగార్జున, ధనుష్తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. శేఖర్తో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో మా పెర్ఫార్మన్స్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే నా క్యారెక్టర్ మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. ఆడియన్స్ రియాక్షన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నా గత సినిమాల్లోని పాత్రలు గీతాంజలి, శ్రీవల్లి, మహారాణి యేసుబాయిలానే ఇందులో ప్లే చేసిన రోల్ కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
పీ..పీ.. డుమ్ డుమ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES