Sunday, June 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ లో ఉన్న రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలి

పెండింగ్ లో ఉన్న రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలి

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి 
పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలని, రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తివేయాలని సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి దిగ్గి చిరంజీవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకట్ రెడ్డి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం  మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం ఊకే ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బస్సు హామీ తప్ప ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు.

అదేవిధంగా రైతు భరోసా ఎకరానికి 15000 ఇస్తామని, 12 వేలకు తగ్గించి ఆ డబ్బులు కూడా వేయకుండా దాటేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు ? ఇప్పటివరకు కేవలం 3 ఎకరాలు ఉన్న రైతులకు డబ్బులు పడ్డాయి కానీ మిగతా వారికి మాత్రం డబ్బులు పడలేదని, వ్యవసాయం చేస్తున్న రైతులకు పెట్టుబడులకు మాత్రమే పండించిన పంట సరిపోతుంది అని అన్నారు. ఇంకా అప్పుల మీద పడి, రైతు దిగజారాడని మండిపడ్డారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రైతుబంధు డబ్బులు అయినా రైతులకు మిగిలేవని, ఇప్పుడు అప్పుల పాలై పోతున్నారని ఆవేదన చెందారు.  ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకం కింద సిబిల్ స్కోర్ పెట్టి అప్లికేషన్ పెట్టుకున్నా అందరి యువతి యువకుల కు అన్యాయం చేయాలని తెలిపారు.

ఇది కేవలం పార్టీ ప్రచారం కోసమే తప్ప పేదవాళ్ళని అభివృద్ధి చేయడానికి కాదు అని అన్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలి లేకపోతే సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాట కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలెం అశోక్, మైపతి దశరథం, దాసరి కృష్ణ, కోరం ముత్తయ్య, ఊకె నాగేశ్వరరావు, పోలబోయిన మల్లక్క తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -