Monday, October 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపెండింగ్ ఫీజు రీయంబర్స్ & స్కాలర్ షిప్స్ తక్షణమే విడుదల చేయాలి : ఎస్ఎఫ్ఐ

పెండింగ్ ఫీజు రీయంబర్స్ & స్కాలర్ షిప్స్ తక్షణమే విడుదల చేయాలి : ఎస్ఎఫ్ఐ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ళ నుండి పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్స్ మరియు స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని,కాంగ్రెస్ తాము హామీ ఇచ్చిన ప్రకారం కనీసం 1200 కోట్లైనా విడుదల చేయాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి23 నెలలు గడుస్తున్నా తాము ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఎస్ఎఫ్ఐ విమర్శించింది.

తక్షణమే పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్30న రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పి.జీ. మరియు ఇంజనీరింగ్, ఫార్మసి, మెడికల్, ఇతర ఫ్రోఫెషనల్ విద్యాసంస్థలు, యూనివర్శీటీల బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. బంద్ జయప్రదం కోసం సోమవారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.మమత,రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కార్తీక్, లెనిన్, హైదరాబాద్ జిల్లా నాయకులు నాగేందర్, స్టాలిన్ లతో కలిసి విలేకరులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ళ నుండి సుమారు 8 వేల కోట్లు పైగా బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బకాయిలు దశలు వారీగా విడుదల చేస్తామని ఇప్పటి వరకు కనీసం వారు ఇచ్చిన టోకెన్లు కూడా నిధులు ఇవ్వలేదని తెలిపారు.

విద్యాసంస్థలల యాజామన్యాలు బంద్ ప్రకటించి సంవత్సరం కాలంగా పోరాడితే 1200 కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వారు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా హామీ తప్పిందని అన్నారు.

కనీసం యాజామన్యాలు ఫీజులు రాలేదని పేరుతో రీయంబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్ ఫీజులు విద్యార్థుల నుండి బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని పేద ఎస్.సి.,ఎస్టీ, వెనుకబడిన, మైనార్టీ వర్గాలు విద్యార్థుల లక్షలాది రూపాయలు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, ప్రభుత్వం విద్యార్ధులకు భరోసా ఇచ్చేలా ఫీజుల చెల్లింపుకోసం గ్యారెంటీ ఇచ్చి జీ.వో. ఇచ్చి విద్యార్థులు భవిష్యత్ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి, కనీసం ఇన్ని సంవత్సరాలు నుండి పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం చేయాలని అన్నారు.

నవంబర్ మొదటి వారంలో బకాయిలు విడుదల చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమీకరణ చేసి ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

విద్యపై ముఖ్యమంత్రి కి అవగాహన లేకపోవడం వల్లన,కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల విద్యారంగం ఆగమాగం అవుతుందని బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు, డైట్, కాస్మోటిక్ ఛార్జీలు బకాయిలు, ఫీజులు బకాయిలు, ఇలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రేవంత్ రెడ్డి స్పందించడం లేదని అన్నారు.

తక్షణమే ముఖ్యమంత్రి విద్యారంగం సమస్యలు పై రివ్యూ చేసి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని అన్నారు.రాష్ట్ర యూనివర్శీటీలలో కూడా డైట్ ఛార్జీలు విడుదల చేయలేదని ,యూనివర్శీటీలు కూడా అభివృద్ధి చేయలేదని తెలిపారు.

అందుకే ఈ సమస్యలు పరిష్కారం కోసం అక్టోబర్30న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యసంస్థలు, ఫ్రోఫెషనల్ విద్యాసంస్థలు, యూనివర్శీటీల బంద్ నిర్వహిస్తున్నామని ఈ బంద్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు సహాకరించాలని కోరారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -