– తహశీల్దార్ శ్రీనివాస్
నవతెలంగాణ-నవాబు పేట : భూభారతి చట్టం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంలభిస్తుంది అని మండల తహశీల్దార్ శ్రీనివాస్ అన్నారు.సోమవారం మండల పరిధిలోని లింగం పల్లి కాకర్జాల గ్రామాలలోని గ్రామ పంచాయతీల ఆవరణలో ఏర్పాటుచేసిన భూ భారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొని రైతులకు భూమి సమస్యలు ఉన్న ఫిర్యాదులను స్వీకరనను పరిశీలించారు.రైతులకు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రైతులు సంబంధించిన సమస్యల్ని నేరుగా సంప్రదించవచ్చు అని సూచించారు.ఈ సందర్భంగా లింగంపల్లి లో 10, కాకర్జాల లో 5 ఫిర్యాదులు అందాయి అని తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు వాటిని వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా కాకర్జాల గ్రామంలో మండల డిప్యూటీ తహశీల్దార్ సువర్ణ బృందం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆంజనేయులు గాయత్రి సీనియర్ అసిస్టెంట్ జ్యోతి వెంకన్న నారాయణ మణికంఠ ఆపరేటర్లు బాల్ రాజ్ లక్ష్మీనారాయణ పంచాయతి కార్యదర్శి స్వేత.రికార్డు అసిస్టెంట్ లు గోపాల్ సత్యం బుచ్చయ్య రాజు శిరీష గ్రామ నాయకులు సుధాకర్ రెడ్డి రాఘవ రెడ్డి శ్యాం రెడ్డి శేఖర్ రెడ్డి రాం రెడ్డి బుచ్చిరెడ్డి. దుబాయ్ రాము శాంతయ్య యాదగిరి పుల్లారెడ్డి బాలకిష్టయ్య అంజయ్య నవీన్ నర్సింహులు బాలయ్య రాజు ఇస్తారయ్య జంగయ్య.తదితరులు పాల్గొన్నారు.
భూభారతితో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం
- Advertisement -
- Advertisement -