Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భూభారతి ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూభారతి ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం

- Advertisement -

జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: భూ సమస్యలకు  రెవెన్యూ సదస్సుల ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతు లు అందరు సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం రోజు భువనగిరి మండలం లో చీమలకొండూరు గ్రామంలో భూ భారతి రెవిన్యూ సదస్సు లో పాల్గొని  జరుగుతున్న రెవెన్యూ సదస్సు ను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్బంగా అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా అని అధికారులను ఆరా తీశారు.వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్‌డెస్క్, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సదస్సులో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.భూ భారతి చట్టం లో రైతుల సమస్య లు తప్పనిసరిగా పరిస్కారం అవుతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో  మండల   డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్, సంబంధిత అధికారులు  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad