– డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీలకు అనుమతులు వస్తాయనీ, ఎలాంటి ఇబ్బందులుండవని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు, మెడికల్ కాలేజీల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు చేయడం, నోటీసులు ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియ అని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా నోటీసులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాల్లోని కాలేజీలకూ నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు. మన రాష్ట్రంలోని కాలేజీలకు మాత్రమే నోటీసులు వచ్చినట్టుగా, నోటీసులు రావడం ఇదే మొదటిసారి అన్నట్టుగా అపోహలు సృష్టించి, తప్పుడు ప్రచారాలు చేయడం సరి కాదని స్పష్టం చేశారు. ఒకేసారి ఎక్కువ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల ఫ్యాకల్టీ కొరత, మౌళిక వసతుల కల్పనలో ఇబ్బందులు వచ్చాయని వివరించారు. వాటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు. అవసరమైన బడ్జెట్ కేటాయిస్తూ జీవోలు జారీ చేసినట్టు వెల్లడించారు.
అన్ని కాలేజీలకు అనుమతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES