- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : చోరీకి గురైన సొంత ఫోన్ను ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. ముంబయికి చెందిన అంకితా గుప్తా యూపీలోని వారణాసి అస్సీ ఘాట్కు వెళ్లిన సందర్భంలో ఆమె ఫోన్ దొంగతనం జరిగింది. అనంతరం పోలీసులను ఆశ్రయించగా, వారినుంచి సరైన స్పందన రాలేదు. దీంతో స్నేహితుల సహాయంతో తన ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఫోన్ లోకేషన్ను కనిపెట్టి అమెకు ఫోన్ అందజేశారు.
- Advertisement -



