అహ్మదాబాద్: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్టు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. రూపానీ కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం డీఎన్ఏ సరిపోలిందని వెల్లడించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రూపానీ కుటుంబ సభ్యులను కలిసి డీఎన్ఏ సరిపోలిక గురించి తెలియజేసినట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ పేర్కొన్నారు.
47 మృతదేహాలు గుర్తింపు
ఇప్పటిదాకా 47 మంది మృతదేహాలను డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించామని బీజే వైద్య కళాశాల అదనపు సివిల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీశ్ పటేల్ తెలిపారు. 14 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిం చామన్నారు. ప్రమాద తీవ్రత వల్ల చాలావరకు గుర్తు పట్ట లేని విధంగా మృతదేహాలు కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టు లు చేస్తున్నామన్నారు. ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండడం డెడ్బాడీల గుర్తింపు ఆలస్యం అవుతోంద న్నారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవ డానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మృతులు ఉదయపుర్, వడోదర, ఖేడా, మెహ్సానా, అహ్మదా బాద్, బోటాడ్ జిల్లాలకు చెందినవారని స్పష్టం చేశారు.
ముమ్మరంగా దర్యాప్తు
విషాదం జరిగిన మూడు రోజుల తర్వాత డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించే ప్రక్రియ వేగవంత మైంది. మూడు దశాబ్దాల్లో దేశంలో జరిగిన అత్యంత దారుణమైన విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నేతృత్వంలోని వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేపడుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో నిమగమయ్యాయి. గత మూడు రోజులుగా ఏఏఐబీ బృందం ఘటనాస్థలిలో ఉండి దర్యాప్తు చేపడుతోందని రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
పెరిగిన మృతుల సంఖ్య
మరోవైపు, విమాన ప్రమాదంలో మరణించినవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 278 కు చేరిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదస్థలిలో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నామని తెలిపారు. శనివారం బీజే మెడికల్ కాలేజీ మెస్పై ఒక యువతి సహా మూడు మృతదేహాలు కాలిపోయిన స్థితిలో కనిపించాయన్నారు. ఆ యువతి ఎయిర్ ఇండియా సిబ్బందిగా అనుమానిస్తున్నామన్నారు.
త్రుటిలో తప్పిన ముప్పు..
ప్రాణాలతో బయటపడ్డ స్టూడెంట్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బీహార్కు చెందిన వైద్య విద్యార్థి రితేశ్ కుమార్ శర్మ త్రుటిలో తప్పించుకు న్నాడు. ప్రమాదం జరిగినప్పుడు తాను క్యాంటీన్లో భోజనం చేస్తున్నానని రితేశ్ చెప్పాడు. ఇంతలో విమానం అకస్మాత్తుగా క్యాంటీన్ భవనంలోకి ప్రవేశించిందని, పెద్ద పేలుడు సంభవించడంతో అక్కడ గందరగోళం నెలకొం దన్నాడు. ఈ ప్రమాదంలో తాను గాయాలతో బయట పడ్డానని తెలిపాడు.
”గురువారం మధ్యాహ్నం 1.40 గంటలు అయ్యింది. మేము మెస్లో భోజనం చేస్తున్నాం. మా మెస్ విమానాశ్రయం నుంచి 3- 4 కి.మీ దూరంలో ఉంది. మేము మొదటి అంతస్తులోని మెస్లో ఆహారం తింటున్నాం. విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో భవనం శిథిలాలు డైనింగ్ టేబుల్ మీద పడ్డాయి. విమానం లోపల ఉంచిన లగేజ్ బ్యాగులు నా కాళ్ల మీద పడ్డాయి. అప్పుడు నా కాలు, చేతికి గాయాలు అయ్యాయి. నా కండ్ల ముందు ఇద్దరు స్నేహితులు చనిపోయారు. పేలుడు జరిగినప్పుడు మాకేమి అర్థం కాలేదు. అందరం భయంతో పరుగెత్తాం” అని రితేశ్ కుమార్ శర్మ తెలిపాడు.
బ్లాక్ బాక్స్ రికవరీ..దర్యాప్తులో పురోగతి
బ్లాక్ బాక్స్ రికవరీ దర్యాప్తు ప్రక్రియలో చాలా ముఖ్యమైన భాగమని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బంచా నిధి పాణి అన్నారు. బ్లాక్ బాక్స్ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో ఇరుక్కుపోయిందన్నారు. దాన్ని అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. క్రేన్లు, కార్మికులు, ఇంజనీర్లను అందించాలని ఏఏఐబీ తమను కోరిందని, అందుకు సహకరించామన్నారు.
278కి చేరిన విమాన ప్రమాద మృతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES