Monday, June 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ 30న కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయండి…

 30న కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయండి…

- Advertisement -

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య….
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ :  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య పిలుపునిచ్చారు.

సోమవారం భువనగిరి మండల పరిధిలోని నందనం, అనాజిపురం గ్రామాల్లోని ఉపాధి హామీ పని ప్రదేశాలను సందర్శించిన అనంతరం కార్మికులను ఉద్దేశించి అంజయ్య మాట్లాడుతూ 2005లో అనేకమంది వ్యవసాయ కార్మికులు వామపక్ష పార్టీ ప్రజా సంఘాల పోరాట ఫలితంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఏర్పడితే నేటి బిజెపి మోడీ ప్రభుత్వం చట్టాన్ని ఎత్తివేయాలను కుంట చేస్తుందని ఈ కుట్రలను కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 100 రోజుల నుండి 200 రోజుల వరకు పని దినాలను కల్పించాలని, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, పని ప్రదేశంలో నీడ కోసం టెంటు, తాగడానికి నీళ్లు, మెడికల్ కిట్టు ఏర్పాటు చేయాలని, దరఖాస్తు చేసుకున్న వారికి జాబ్ కార్డుతో పాటు పని చూపించాలని, వారం వారము చేసిన పనికి డబ్బులు చెల్లించాలని, ఖాళీగా ఉన్న ఉపాధి హామీ సిబ్బందిని నియమించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న ధర్నాలలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని అంజయ్య కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, రైతు సంఘం జిల్లా నాయకులు ఎదునూరి మల్లేశం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి హామీ కార్మికులు కొల్లూరి సిద్దిరాజు, సురివి పద్మ, అల్లంపల్లి భారతమ్మ, కడారి మల్లయ్య, బొల్లెపెల్లి బుచ్చమ్మ, సుగుణమ్మ,యండి. శాందిపాష , తెల్జురి బాలమ్మ, కంచం నీలమ్మ, షేక్ నజీమా,  యాట సావిత్రి, యశోద, లక్ష్మమ్మ, రాణి, సత్తయ్య, పద్మ, శోభా, నాగరాణి, సుమలత, సరిత, జయమ్మ, పద్మ, అంసమ్మ, కృష్ణవేణి లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -