Monday, July 7, 2025
E-PAPER
Homeజాతీయంట్రంప్‌ వ్యాఖ్యలను ప్రధాని మోడీ తిరస్కరించలేదు: పవన్‌ఖేరా

ట్రంప్‌ వ్యాఖ్యలను ప్రధాని మోడీ తిరస్కరించలేదు: పవన్‌ఖేరా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ వ్యాఖ్యలను ప్రధాని మోడీ ఒక్కసారి కూడా తిరస్కరించలేదని , ఈ మౌనం వెనుక అర్థం ఏమిటని కాంగ్రెస్‌ గురువారం ప్రశ్నించింది. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య వివాదాన్ని వాణిజ్యం ఒప్పందంతో పరిష్కరించానని ట్రంప్‌ పదేపదే ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపివేసినట్లు ప్రకటించడం ఇది ఎనిమిదోసారని కాంగ్రెస్‌ మీడియా మరియు ప్రచార విభాగం అధ్యక్షుడు పవన్‌ఖేరా అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ను భారత్‌ ముగించేలా వాణిజ్యాన్ని ఉపయోగించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఈ వాదనను ఒక్కసారి కూడా తిరస్కరించలేదు. ఈ మౌనం అర్థం ఏమిటని ఎక్స్‌లో ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -