నవతెలంగాణ-హైదరాబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ సైప్రస్ పర్యటనలో భాగంగా నిన్న ఆ దేశంలో అడుగుపెట్టారు. రెండు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని సైప్రస్లో పర్యటించడం ఇదే ప్రథమం కావడంతో ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులు ప్రధాని మోడీకి అత్యంత ఉత్సాహంగా, ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ ఘన స్వాగతానికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. సైప్రస్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం సైప్రస్ రాజధాని నికోసియాకు చేరుకున్న ప్రధాని మోడీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్, ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ ప్రత్యేక ఆదరణకు గాను ఆ దేశ అధ్యక్షుడికి ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.
2026లో సైప్రస్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. అలాగే భారత్ ఆ ప్రాంతంలో తన ఉనికిని పటిష్ఠం చేసుకోవాలని చూస్తున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. “సైప్రస్ ఒక సన్నిహిత మిత్రదేశం. మధ్యధరా ప్రాంతం, యూరోపియన్ యూనియన్లలో ఒక ముఖ్యమైన భాగస్వామి” అని ప్రధాని మోడీ అభివర్ణించారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
నిన్న సైప్రస్ ప్రధాన ఆర్థిక కేంద్రమైన లిమాసోల్లో ప్రధాని మోడీ, అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ ఇరు దేశాల వ్యాపార ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరిచాయి. ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో నేడు అధికారిక చర్చలు, బహుళస్థాయి సహకార ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి.
సైప్రస్లో ప్రధాని మోడీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES