- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: 15న కోల్కతాలోని ఈస్టర్న్ కమాండ్ హెడ్క్వార్టర్స్లో జరగనున్న మూడు రోజుల కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ థీమ్ “యర్ ఆఫ్ రిఫార్మ్స్ – ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ది ఫ్యూచర్”. ఇందులో సైన్యంలోని సంస్థాగత సంస్కరణలు, సాంకేతిక ఆధునీకరణ, విభాగాల సమన్వయం, బహుళ రంగాల యుద్ధ సన్నద్ధత వంటి అంశాలపై చర్చ జరగనుంది. మోదీ సెప్టెంబర్ 14 సాయంత్రం అస్సాంలోని జోర్హాట్ నుంచి కోల్కతాకు చేరుకొని రాజ్భవన్లో రాత్రి ఉండనున్నారు.
- Advertisement -