Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకానిస్టేబుల్ కృష్టం రాజుపై‘పోక్సో కేసు’

కానిస్టేబుల్ కృష్టం రాజుపై‘పోక్సో కేసు’

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కృష్ణం రాజుపై సూర్యాపేట రూరల్ పోలీసు స్టేషన్లో ‘పోక్సో కేసు’ నమోదైంది. ఈ కానిస్టేబుల్ కృష్ణంరాజు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లిళ్లు చేసుకున్న విషయం బయటకు చెపితే చంపేస్తానంటూ బాధితులను బెదిరించాడు. నాలుగో భార్యగా పదవ తరగతి చదువుతున్న బాలికను కానిస్టేబుల్ కృష్ణంరాజు పెళ్లి చేసుకున్నాడు. వారం రోజుల క్రితం కానిస్టేబుల్ కృష్ణంరాజును జిల్లా ఎస్పీ నరసింహ సస్పెండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా పరిధిలో ఇటీవల కొందరు ఖాకీల తీరు వివాదాస్పదంగా మారింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వృత్తిలో కొనసాగుతూ కొందరు ఖాకీలు దిగజారి ప్రవర్తిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ పాత ఎస్ఐ ప్రవీణ్ కుమార్పై ఇటీవల మరోసారి వేటు పడిన సంగతి తెలిసిందే. ఓ మహిళా కానిస్టేబుల్ను వేధిస్తున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ అనంతరం రేంజ్ ఆఫీసుకు ఐజీ అటాచ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad