బెల్ట్ షాప్ పై పోలీసుల దాడి

నవతెలంగాణ- రామారెడ్డి
అనుమతి లేకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపుపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని గిద్ద గ్రామానికి చెందిన పెనుగొండ బాలరాజు ఇంటి వద్ద అధిక ధరలకు అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు ఇంటి పై దాడి చేయగా రూ, 9 వేల విలువగల 20 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. దాడిలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love