- భక్తుడు కూరాకుల ఆంజనేయులు విరాళంతో ఏర్పాటు
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవత ప్రాంగణంలో ప్రజలకు సుచికరమైన నాణ్యమైన మాంసాన్ని అందించాలని లక్ష్యంతో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వనదేవతల భక్తుడు ఆదివాసి గిరిజన బిడ్డ కూరాకుల ఆంజనేయులు గారి 12 లక్షల విరాళంతో శనివారం పోర్టబుల్ స్లాటర్ హౌస్ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ హాజరయ్యారు. వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలతో 12 లక్షలతో అత్యధిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కబేలా (జంతుప్రదశాల) నిర్మించారు. మేడారంలో నిర్మించిన కబేళాతో భక్తులకు, ప్రజలకు నాణ్యమైన మాంసం ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. మేడారంలో మాంసం విక్రయించే వ్యాపారులు సుమారు 100 వరకు ఉంటారు. భక్తుల, ప్రజల ఆరోగ్యం దృశ్య మాంసం కోసం గొర్రెలు మేకలను వధించేందుకు అత్యధిక సౌకర్యాలతో ఫ్లాటర్ హౌసును ప్రారంభించనున్నారు. అత్యాధునిక పద్ధతిలో మాంసం వ్యర్థాలతో కృత్రిమ ఎరువు ఉత్పత్తి చేసే ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. మాంసం నాణ్యత నిర్ధారించేందుకు పశు వైద్యుని నియమించారు. అందరూ ఆరోగ్యంగా ఉండడానికి మేడారానికి వచ్చే భక్తులు స్లాటర్ హౌసులు వినియోగించుకోవాలని పశువైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు కోరుతున్నారు. కార్యక్రమంలో పశు వైద్య నిపుణులు సైంటిస్ట్ డాక్టర్ చిట్టిమల్ల రామకృష్ణ, డాక్టర్ గిరీష్ పాటిల్, ఎస్కే ఖాజా, పనిచేసేవారు, యూత్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.