నవతెలంగాణ-హైదరాబాద్: భారత్లో పేదల సంఖ్య తగ్గారని తాజాగా ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరికం రేటు 2022-23కి 5.3 శాతానికి తగ్గిందని తాజాగా వరల్డ్ బ్యాంకు నివేదిక పేర్కొంది. 2011-12 నాటికి 344.47 మిలియన్ల ప్రజలు పేదరికంలో మగ్గిపోయారని, ఇప్పుడు వారి సంఖ్య 2022-23 నాటికి 75.24 మిలియన్ల ప్రజలే పేదిరికంలో ఉన్నారని వీరి సంఖ్య పదకొండేళ్ల కంటే ఇప్పుడు బాగా తగ్గిందని ఈ నివేదిక పేర్కింది. అంటే దాదాపు 11 సంవత్సరాలలో 269 మిలియన్ల ప్రజలు తీవ్ర పేదరికం నుండి బయటపడ్డారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా 2011- 12 నాటికి భారత్లో అత్యంత పేదవారిలో 65 శాతం మంది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే 2022-23 నాటికి ఈ రాష్ట్రాల్లో పేదరికం మూడింట రెండువంతలకు తగ్గింది.
2021 ధరల ఆధారంగా.. మూడు డాలర్లు (ఇండియన్ కరెన్సీలో 257 రూపాయలు) కంటే తక్కువ తక్కువ ఖర్చు పెడితే అంతర్జాతీయ దారిద్య్ర రేఖ కంటే దిగువ ఉన్నట్టుగా వరల్ బ్యాంకు అంచనా వేసింది. ఈ లెక్కన చూస్తే భారత్లో గ్రామీణ, పట్టణ ప్రాంతల్లో రోజుకు మూడు డాలర్ల కంటే తక్కువపెట్టే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని, దీంతో భారత్లో పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
2017 ధరల ఆధారంగా.. 2.15 డాటర్లను తక్కువ ఖర్చుపెట్టి.. తీవ్ర పేదరికంలో ఉన్న భారతీయులు 2.3 శాతం మంది ఉన్నారు. 2011-12లో అత్యంత పేదిరకంలో ఉన్న వారి శాతం 16.2 శాతం. ఇప్పుడు 2.3 శాతానికి తగ్గిందని ప్రపంచబ్యాంకు తాజా నివేదిక తెలిపింది. తాజా డేటా ప్రకారం రోజుకు 2.5 డాలర్లను కూడా ఖర్చుపెట్టలేనివారు 2011లో 205.93 మిలియన్ల ప్రజలు ఉంటే.. 2022 నాటికి 33.66 మిలియన్ల మందికి తగ్గారు. గడచిన 11 ఏళ్లలో గ్రామీణ తీవ్ర పేదరికం 18.4 శాతం నుండి 2.8 శాతానికి తగ్గింది. పట్టణ తీవ్ర పేదరికం 10.7 నుంచి 1.1 శాతానికి తగ్గింది.
బహుమితీయ పేదరికపు సూచిక (ఎంపిఐ) 2005-06లో 53.8 శాతంగా ఉంది. 2019-21 నాటికి 16.4 శాతానికి తగ్గింది. 2022-23లో 15.5 శాతానికి తగ్గిందని ప్రపంచబ్యాంకు తాజా నివేదిక తెలిపింది. పేదరికాన్ని తగ్గించడంలో ప్రధాని మోడీ నాయకత్వం తీవ్రంగా కృషి చేసిందని వరల్డ్ బ్యాంకు పేర్కొంది. పిఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, జన ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాలతోపాటు, గృహ నిర్మాణం, ఇంధనం, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవడం వల్లే పేదరికం తగ్గిందని వరల్డ్బ్యాంకు పేర్కొంది.