Thursday, November 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేపు హైద‌రాబాద్‌కు రాష్ట్రప‌తి రాక‌

రేపు హైద‌రాబాద్‌కు రాష్ట్రప‌తి రాక‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రేపు రాప్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైద‌రాబాద్‌కు రానున్నారు.శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రాజ్ భవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి.. రాజ్ భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటలకు రాష్ట్రపతి నిలయం వేదికగా నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం 6:15 గంటలకు ఆమె తిరిగి రాజ్ భవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

రాత్రి తెలంగాణ రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ముర్ము బస చేయనున్నారు. ఎల్లుండి(శనివారం) ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యోత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -