Saturday, May 3, 2025
Homeజాతీయంవిజయవాడ చేరుకున్న ప్రధాని మోడీ..

విజయవాడ చేరుకున్న ప్రధాని మోడీ..

నవతెలంగాణ – అమరావతి: అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ కార్యాక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పుడే ప్రధాని తిరువనంతపురం నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో నేరుగా ఏపీ సచివాలయం లోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వీరంగా సభాస్థలికి చేరుకుంటారు. ప్రధాని రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img