– 51వ జీ 7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు
కెనడా: ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా… మంగళ వారం కెనడాలోని కాల్గరీ నగరానికి చేరుకున్నారు. కననాస్కిస్ వేదికగా నేడు జరగనున్న 51వ జీ 7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి మోడీ పాల్గొననున్నారు. ఈ సదస్సు కు ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలనెస్కీతో పాటు వివిధ దేశాల నేతలు పాల్గొననున్నారు. ఈ సదస్సులో భాగంగా కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీతోపాటు వివిధ దేశాల నేతలతో ప్రధాని మోడి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగే సదస్సులో ప్రధాని మోడీ, జెలెన్ స్కీతోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా తదితర దేశాలకు చెందిన నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ప్రపంచంలో జీ -7 దేశాల ప్రజల రక్షణ, ఇంధన భద్రతను పెంచడం, డిజిటల్ రంగాన్ని వేగవంతం చేయడం, భవిష్యత్తు భాగస్వామ్యాలు సురక్షితం చేయడం వంటి తదితర అంశాలను ఈ సదస్సులో ప్రధానంగా నేతలు చర్చించనున్నారు. ప్రధాని మోడీ ఇప్పటికే సైప్రస్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోడీకి సైప్రస్ ప్రభుత్వం బహుకరించిన సంగతి విదితమే. అలాగే సైప్రస్ ఇచ్చిన అతిథ్యంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ కెనడా నుంచి క్రొయేషియాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి రానున్నారు.
కెనడాలో ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES